telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : విరాట్ కోహ్లీకి దిమ్మతిరిగే షాక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఊపు మీద ఉన్న విషయం తెలిసిందే. వరుసగా అన్ని మ్యాచ్ లు గెలుచుకుంటూ పోతుంది. అయితే నిన్న మొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో బెంగుళూరుపై విజయం సాధించింది చెన్నై. అయితే ఈ షాకు నుంచి తేరుకోకముందే.. తాజాగా కెప్టెన్ కోహ్లీకి మరో షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో.. ఆ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీనితో కెప్టెన్ కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఇదే తప్పిదం మూడు సార్లు కొనసాగిస్తే.. ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా ఇప్పటికే ఐపిఎల్ 2021 లో స్లో ఓవర్లు వేసినందుకు ఇప్పటికే చెన్నై కెప్టెన్ ధోనీ, ముంబై కెప్టెన్ రోహిత్, కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు జరిమానా పడింది. 

Related posts