telugu navyamedia
క్రీడలు నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

ఢిల్లీలో ఘనంగా వీర్ బాల్ దివస్, అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు పురస్కారాలను అందచేసిన రాష్ట్రపతి

వివిధ రంగాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు.

న్యూఢిల్లీలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ను ఇద్దరు పిల్లలు అందుకున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్న తెలంగాణకు చెందిన పడకంటి విశ్వనాథ్ కార్తికేయ ఒకరు.

తెలంగాణ మేడ్చల్ మల్కాజ్ గిరికి చెందిన విశ్వనాథ్ కార్తికేయ పర్వతారోహకుడు. ఆసియా నుండి ఐలాండ్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడు కావడం విశేషం.

అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్న ఏపీకి చెందిన పారా అథ్లెట్ శివాని అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన శివానిది నిరుపేద కుటుంబం. ప్రస్తుతానికి హైదరాబాదులోని స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ తీసుకుంటుంది. తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తుంటారు.

Related posts