కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ గురువారం ఇక్కడి జల్ సౌధలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల సమన్యాయ పంపిణీలో కేఆర్ఎంబీ క్రియాశీలక పాత్ర పోషించాలని, తెలంగాణ రైతులకు రబీ పంటకు సరిపడా కృష్ణాజలాలు అందేలా చూడాలని కోరారు.