ఈరోజు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.in లో చూసుకోవాలని తెలిపారు. ఈ పరీక్షలకు 1,43,330 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1,19,187 మంది (83.16 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
అలానే ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించిన సమయంలో కరోనా బారిన విద్యార్థుల నుంచి ఎంసెట్ కమిటీ దరఖాస్తులను స్వీకరించింది. వారికి ఈనెల 8వ తేదీన పరీక్ష నిర్వహించాలని కమిటీ భావిస్తోంది. 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ తరువాత రెండు మూడు రోజుల్లో వారి ఫలితాలను విడుదల చేయనుంది. ఇక గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలను కూడా వచ్చే వారంలో విడుదల చేసేందుకు ప్లాంక్ చేశారు.
రాజకీయాలు కావాలంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి: జవహర్