telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు ప్రధాని మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు.

ఈ కార్యక్రమంలో 12 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనేలా ప్లాన్ చేశారు.

ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవ్వబోతున్నారు.

సొంతంగా 370, కూటమితో కలిసి 400 సీట్లు సాధించాలనుకుంటున్న బీజేపీ.. భారీ ప్రచారంతో ప్రతిపక్షాలకు షాక్ ఇస్తోంది.

ఇవాళ నామినేషన్ సందర్భంగా.. భారీ రోడ్ షో, ప్రచార సభ జరగనున్నాయి. అందుకే.. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు.

Related posts