రావుగారు రిటైర్ అయ్యారు. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది. రూ.20 లక్షలు, తన మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి, ఆమెకు ఎటిఎం కార్డు పిన్ కూడా చెప్పారు.
ఒకసారి పనిమీద గంటసేపు బయటకు వెళ్లాక ఫోన్ మర్చిపోయానని గుర్తుకొచ్చింది.
వెంటనే ఇంటికి వచ్చారు. సోఫాలో పడివున్న ఫోన్ చూసి కుదుటపడ్డారు. సోఫాలో కూర్చొని భార్యను “ఫోన్ వచ్చిందా ?” అని అడిగారు.
“అవునండి. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని” రావుగారికి చెమటలు పట్టి సోఫాలో కూలబడ్డాడు. భయాందోళనతో “ఒ.టి.పి.. ఇచ్చావా ?” అని అడిగాడు.
భార్య : అవును, బ్యాంకు మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇచ్చాను. రావుగారు ఇంకా కుప్పకూలిపోయాడు. తల తిరుగుతున్నట్టు అనిపించింది.
తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. ఇందులో రూ.20 లక్షలు అలాగే ఉన్నాయి. “ఏ ఓటీపీ ఇచ్చావు” అని అడిగారు.
భార్య అమాయకంగా చెప్పింది “ఓటీపీ 4042 గా వచ్చింది. జాయింట్ అకౌంట్ కదా. నా వంతు ఓటీపీ 2021 ఇచ్చాను. రావుగారికి పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించింది. అందుకనే కదా “అర్ధాంగి” అంటారు.

