telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదు: కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రానున్న మున్సిపల్ ఎన్నికల పోటీపై మాట్లాడుతూ, తమ పార్టీ ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు.

ఎన్నికల్లో మద్దతు కావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువత, మహిళలు కోరితే అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.

రాజకీయాల్లోకి రావాలనుకునే వారు మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు రాజకీయాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవ్ సికింద్రాబాద్’ ర్యాలీకి కేటీఆర్ మద్దతు తెలిపారు.

సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలన్న కేటీఆర్ డిమాండ్‌పై కవిత స్పందిస్తూ, “కేటీఆర్ సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలని ఉద్యమిస్తుంటే నాకు నవ్వు వస్తోంది.

సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలని డిమాండ్ చేసిన వారిని పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అణిచివేశారు, జైళ్లలో వేశారు. కానీ, ఇప్పుడు కేటీఆర్ వెళ్లి సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయమని మాట్లాడుతున్నారు” అని విమర్శించారు.

Related posts