telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు తెలంగాణ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక

నేడు ఉమ్మడి ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నిక.

ప్రశాంత ఎన్నికల కోసం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరగడంతో పెరిగిన ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాల్లో వసతులను మెరుగు పరిచారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఇందులో ముగ్గురు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఉన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 173 పోలింగ్ కేంద్రాలుండగా.. వాటిల్లో ఖమ్మంలో 118, భద్రాద్రి కొత్తగూడెంలో 55 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1,23,985 మంది ఓటర్లు ఉన్నారు.

సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Related posts