telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

గోపీచంద్ తో రొమాన్స్ చేయనున్న ఈషా రెబ్బ…

గోపిచంద్‌ హీరోగా మారుతీ దర్శకత్వంలో సినిమా తెరక్కనుంది. దీనికి ‘పక్కా కమర్షియల్‌’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనపించనున్నాడు. ఈ సినిమా జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. అయితే.. ఈ మధ్యే దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ వచ్చేసింది. అయితే ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కథ ప్రకారం ఇందులో ఇద్దరు హీరోయిన్‌లకు ఆస్కారం ఉందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా ముద్దుగుమ్మ ఈషా రెబ్బ నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ప్రస్తుతం గోపీచంద్ తన నూతన సినిమా సీటీమార్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఇందులో గోపిచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్ గా కనిపించగా తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ గా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చూడాలి ఈ ఇద్దరు కోచ్ లు తమ ఆటలో విజయం సాధిస్తారా… లేదా అనేది.

Related posts