నేడు కూడా స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. వరుసగా ఆరో రోజు మార్కెట్లు పతనమయ్యాయి. అమెరికా-చైనాల మధ్య కొనసాగుతన్న వాణిజ్య యుద్ధంతో పాటు పలు కార్పొరేట్ కంపెనీల ఫలితాలు అంచాలను అందుకోకపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీనికి తోడు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో… మదుపరులు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 488 పాయింట్లు పతనమై 37,789కి పడిపోయింది. నిఫ్టీ 138 పాయింట్లు కోల్పోయి 11,359 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
30 స్టాకుల సెన్సెక్స్ లో కేవలం రెండు కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. వీటిలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.29%), టీసీఎస్ (0.11%) ఉన్నాయి.
టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.35%), బజాజ్ ఫైనాన్స్ (-3.22%), టాటా మోటార్స్ (-2.80%), బజాజ్ ఆటో (-2.55%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాా (-2.53%).