తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఉచిత దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 8-10 గంటల సమయం పడుతుంది..
రూ. 300 శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,044.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,241.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 5.08 కోట్లు

