సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ ప్రత్యేక సువిధ రైలును ఈ నెల 12న నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైలు, విజయవాడ, విశాఖపట్నం స్టేషన్ లకు వెళ్లదని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.
సికింద్రాబాద్ స్టేషన్ లో 12న సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరే రైలు (82712), 13వ తేదీ ఉదయం 8.55 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు చేరుతుందని, అదే రోజు సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, 14 ఉదయం 7.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.