ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు తగ్గింది. అందుకు కారణం ‘మన్మథుడు 2’ ఫ్లాప్ అవడమేనని టాలీవుడ్ టాక్. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగిన రకుల్కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. దీంతో కోలీవుడ్, బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. అయితే లాక్ డౌన్ పీరియడ్లో రకుల్ ప్రీత్ వార్తల్లో నిలిచినంతగా మరే హీరోయిన్ లేదు. సోదరుడితో ఆటలు ఆడటమైనా, మెడికల్ షాపుల్లో మందులు కొనడానికి బయటకు వచ్చిన వీడియో అయినా సరే. కొద్ది రోజులక్రితం క్రితం మంచు లక్ష్మీతో ఇన్స్టాలో లైవ్లోకి వచ్చింది. అక్కడా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ముంబైలో మూడు నెలల పాటు ఒకేచోట ఉండటానికి ఈ విశ్వం తనకు సహాయం చేసిందని రకుల్ ప్రీత్ సింగ్ తన లాక్డౌన్ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన సోదరుడు అమన్ ప్రీత్ ఒక మీటింగ్ కోసం ముంబైకి వచ్చి లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయాడని చెప్పింది. ఒకవైపు విమాన సర్వీసులు లేక మరోవైపు కర్ఫ్యూ విధించినందున.. అమన్ నా దగ్గరే ఉండిపోయాడు. లేకపోతే నేను ఒంటరిగా ఉండేదాన్ని. “విశ్వం మా ఇద్దరినీ ఒకే చోట చేర్చి చూసుకున్నట్లు ఉంది” అని రకుల్ పేర్కొంది.
previous post

