బాలీవుడ్ నటి విద్యాబాలన్ మ్యాథ్స్ జీనియస్ శంకుతల దేవి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. లేడీ డైరెక్టర్ అను మీనన్ తెరకెక్కించనున్న ఈచిత్రాన్ని విక్రమ్ మల్హోత్రా నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో విద్యా లుక్ ఆకట్టుకునేలా ఉంది. “శకుంతల దేవి” ఓ హ్యూమన్ కంప్యూటర్. ఐదు సంవత్సరాల వయస్సులో 18 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్ధుల మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సులువుగా సాల్వ్ చేసింది. శకుంతల దేవి పాత్రలో నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు విద్యా చెప్పుకొచ్చింది. ఈ మూవీలో విద్యాబాలన్ కూతురి పాత్రలో సన్యామల్హోత్రా నటిస్తోంది. ఈ సినిమాలో శకుంతాలాదేవి కూతురి (అనుపమ బెనర్జీ)పాత్రలో నటిస్తున్నందుకు చాలా ఎక్సయిటింగ్గా ఉందని సన్యా ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ తో ఓ వీడియో పోస్ట్ చేసింది. “దంగల్” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సన్యా మల్హోత్రా. ఈ హీరోయిన్ తక్కువ సమయంలోనే దంగల్, బాద్ షాహో వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించి అందరిని మెప్పించింది. తాజాగా అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది సన్యా.
previous post


హైదరాబాద్ కు మకాం మారుస్తున్న రేణూదేశాయ్