బాలీవుడ్ బ్యూటీ సమీరారెడ్డి తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్సైడర్స్, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో పని చేయడం అంటే వైకుంఠపాళి ఆడటమేనని, ఈ వైకుంఠపాళిలో ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలని, తప్పటడుగు వేస్తే పాము కాటు పడినట్టేనంటూ తనకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది సమీరా. తాను ఒక రోజు షూటింగ్ లో ఉండగా… ఆ రోజు సెట్లో స్క్రిప్టు మార్చి ముద్దు సన్నివేశం పెట్టారని, తనకు స్క్రిప్టు చెప్పినప్పుడు ఈ సీన్ లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను ఆ సీన్ చేయనని చెబితే “మీ ఇష్టం ఆలోచించుకోండి… మీ స్థానంలో వేరే వాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది” అంటూ హెచ్చరించారని వెల్లడించింది సమీరా. ఇక మరో సినిమాలో ఓ బాలీవుడ్ హీరోతో పని చేస్తున్నప్పుడు ఆయన ‘నీతో నటించడం చాలా బోర్. మళ్లీ నీతో కలసి ఎప్పుడూ పని చేయను’ అని అన్నాడని, అన్నట్టుగానే ఆ హీరో తన తరవాత సినిమాల్లో తనను హీరోయిన్ గా ఎంచుకోలేదని, ఇక ఇండస్ట్రీలో నెపోటిజమ్ చాలా ఎక్కువనేని, అయినప్పటికీ ఇండస్ట్రీ తనకు చాలా మంచి సినిమాలను ఇచ్చిందని చెప్పుకొచ్చింది సమీరా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘నరసింహుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమీరా ఆ తరవాత చిరంజీవితో ‘జై చిరంజీవ’, ‘అశోక్’ సినిమాలో నటించారు. ఈమె తెలుగమ్మాయే అయినప్పటికీ కుటుంబం ముంబైలో స్థిరపడటంతో అక్కడే పెరిగారు. ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’తో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వార్దేను 2014లో పెళ్లి చేసుకున్న తరవాత సమీరారెడ్డి సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. భర్తతో కలిసి బిజినెస్ వ్యవహారాల్లో పాలు పంచుకుంటున్నారు. 2015లో సమీరారెడ్డి దంపతులకు బాబు పుట్టాడు. కిందటేడాది జూలైలో పాపకు సమీరా జన్మనిచ్చారు. సమీరారెడ్డి సినిమాలకు దూరమైనప్పటికీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు.
previous post
next post


సమంతా వల్లే అదంతా నేర్చుకున్నా..