telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు.

నిన్న రాత్రి 2.50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయన ల్యాండ్ అయ్యారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో పాటు పలువురు నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

పూలమాల వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో రేవంత్ పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి అమెరికాకు వెళ్లారు.

హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో ఆయన లీడర్ షిప్ కోర్సు పూర్తి చేశారు.

జనవరి 25 నుంచి 30 వరకు జరిగిన లీడర్ షిప్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు.

20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి ఆయన ఈ కోర్సును పూర్తి చేశారు. అమెరికాలో కోర్సును పూర్తి చేసుకున్న తర్వాత ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.

Related posts