“ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. వెండి తెరపై ఈ జంటకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి “డియర్ కామ్రేడ్” చిత్రం చేశారు. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా గడుపుతోంది. తెలుగులో మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ తో ‘భీష్మ’ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. రీసెంట్ గా ఈ భామ తన రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేసిందని వార్తలు గుప్పుమంటున్నాయి. రష్మిక అడుగుతున్న రెమ్యునరేషన్ నిర్మాతలకు షాక్ ఇస్తోందట. పారితోషికం కారణంగానే ఇటీవల నాగ చైతన్య సినిమాను, హిందీ ‘జెర్సీ’ రీమేక్ ను రష్మిక వదులుకుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రష్మికకు చిరాకు తెప్పిస్తున్నాయట. తన పారితోషికం గురించి అనవసరంగా ఎక్కువ చర్చ జరుగుతోందని, తనకున్న డిమాండ్ ను బట్టే నిర్మాతలు రెమ్యునరేషన్ ఇస్తారని సన్నిహితుల వద్ద అంటోందట. అయినా అందరూ అనుకుంటున్న స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచలేదని, రెమ్యునరేషన్ కారణంగా ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా వదులుకోలేదని ఆమె చెబుతోందట. కథ నచ్చకే తప్ప డబ్బుల కారణంగా ఇప్పటివరకు ఏ సినిమా వదులుకోలేదని, అయినా ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోందట.


నైట్ ఫ్రీగా ఉంటావా ? 50 వేలు జీతం ఇస్తా అన్నారు : కరాటే కళ్యాణి