telugu navyamedia
సినిమా వార్తలు

సినిమాల విషయంలో రష్మీ షాకింగ్ నిర్ణయం…!

Rashmi-Gautham

“జబర్దస్త్” యాంకర్ రష్మీ గౌతమ్ ఒకవైపు షోలు చేస్తూనే, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కన్పిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న క్రేజీ యాంకర్లలో రష్మీ ఒకరు. ఇక ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్డేట్ గా ఉంటూ తన అభిమానులతో చాట్ చేస్తూ ఉంటారు. ఇక సినిమాలు మాత్రమే కాకుండా పలు సామజిక అంశాలపైనా రష్మీ స్పందిస్తూ ఉంటారు. అయితే జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది జీవితాలు మారిపోయాయి. అందులో ఎక్స్ ‌ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. ఈ ప్రోగ్రామ్‌కు ముందు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు అంతగా కలిసి రాలేదు. కానీ జబర్దస్త్ తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అటు సినిమాలు.. ఇటు టెలివిజన్ షోలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం టీవీ తెరపై మాత్రమే వస్తుంది. వెండితెరపై హీరోయిన్‌గా రాణిద్దామనుకున్న రష్మీ గౌతమ్ ఆశలు అడియాసలే అయ్యాయి. అందకే ఇక నుంచి సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఒకవేళ కంటెంట్ బాగుంటేనే సినిమాల్లో యాక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరోవైపు రష్మీ గౌతమ్.. టీవీ షోస్‌తో పాటు వెబ్ సిరీస్‌లో నటించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. దీనికి కూడా ఓ కారణం ఉంది.. సినిమాలైతే సెన్సార్ ఉంటుంది. కానీ వెబ్ సిరీస్ విషయంలో అలాంటి హద్దులే ఉండవు.. పైగా అందరికీ ఈజీగా చేరువయ్యే మాధ్యమం ఇప్పుడు వెబ్ సిరీస్ మాత్రమే. పైగా పారితోషికం కూడా భారీగానే వస్తుంది కాబట్టి అసలు అందులో కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. 15 ఏళ్ల కింద ఏ ఫిలిం బై అరవింద్ సినిమా తెరకెక్కించి హిట్ కొట్టిన దర్శకుడు శేఖర్ సూరి దర్శకత్వంలో ఇప్పుడు రష్మీ ఈ వెబ్ సిరీస్ చేయాలని చూస్తుంది. తెలుగులో ఇప్పటి వరకు చాలా మంది వెబ్ సిరీస్ ఎంట్రీ ఇస్తున్నారు. కాజల్ కూడా ఇదే ప్లాన్‌లో ఉంది. ఇప్పుడు రష్మీ గౌతమ్ కూడా ప్లాన్ చేసుకుంటుంది. పైగా స్టోరీ కంటెంట్ కూడా అడల్ట్ టచ్‌తో ఉంటుందని తెలుస్తుంది.

Related posts