telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ఇద్దరూ మిస్ అయ్యారు… అంటూ గ్రూప్ ఫోటో షేర్ చేసిన పూజాహెగ్డే

AY

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో..’. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు పాటలు రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. కాగా పూజా హెగ్డే ఆదివారం `అల‌…వైకుంఠ‌పుర‌ములో..` సినిమాకు సంబంధించిన ఓ గ్రూప్ ఫొటోను షేర్ చేసుకున్నారు. “ఓ కుటుంబ చిత్రాన్ని చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ఫ‌న్‌, టాలెంట్ ఉన్న చిత్ర యూనిట్‌తో క‌లిసి ప‌ని చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ గ్రూప్‌లో సుశాంత్‌, నివేదా మిస్స‌య్యారు. `అల‌..వైకుంఠ‌పుర‌ములో..` సంక్రాంతి రిలీజ్” అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు.

Related posts