telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ లో మైనారిటీలపై దాడులు.. ఆవాసం కోసం భారత్ లో కుటుంబంతో సహా నేత ..

pakistan minority leader in india for shelter

పాక్‌లో మైనార్టీలపై దాడులు ఎక్కువ అవడంతో ఆ దేశానికి చెందిన ఓ మైనార్టీ నేత భారత్‌లో ఆశ్రయం కోరారు. ఖైబర్ ఫక్తున్‌క్వాలోని బారికోట్ రిజర్వడ్ సీటు నుంచి గతంలో బల్దేవ్ కుమార్ అనే వ్యక్తి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ నుంచే ఆయన గెలుపొందారు. అయితే సోరన్ సింగ్ అనే వ్యక్తి మర్డర్ కేసులో బల్దేవ్‌ను వేధించారు. చివరకు ఆ కేసులో ఏ ఆధారాలు లేకపోవడంతో అతన్ని నిర్దోషిగా తేల్చారు. పాక్‌లో మైనార్టీలను వేధిస్తున్నారని, హిందువులు.. సిక్కులను చంపేస్తున్నారని బల్దేవ్ కుమార్ ఆరోపించారు. దీంతో ఆయన తన కుటుంబంతో సహా ఇండియాకు వచ్చారు.

తమ ఫ్యామిలీకి ఆశ్రయం కల్పించాలని ఆయన భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇటీవల లాహోర్‌లో బలవంత మతమార్పిడి సంఘటన జరిగింది. ఓ సిక్కు అమ్మాయిని ఎత్తుకెళ్లి ఆమెను ఇస్లాం మతంలోకి మార్చారు. ముస్లిం వ్యక్తితో పెళ్లి చేసేందుకు ఈ మార్పిడి చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. తమ దేశంలో ఉన్న మైనార్టీలకు పాక్ ఎటువంటి రక్షణ ఇవ్వడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts