భారతదేశం ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతున్నది..ఇది లక్షలాది యువతకు ఉద్యోగాలు, స్టార్టప్లకు అపార అవకాశాలు, దేశ ఆర్థిక శక్తికి బలమైన పునాది అంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచ స్థాయిలో భారత్ తన టెక్ సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను బలంగా చాటుకుంటున్న ఈ కీలక దశలో, India AI Impact Summit వంటి గ్లోబల్ వేదికపై దేశ ప్రతిష్టను మరింత ఉన్నతంగా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉంది.
కానీ కాంగ్రెస్ నాయకులు ప్రదర్శించిన వైఖరి దేశ ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉంది.
ప్రపంచ నాయకులు, టెక్ దిగ్గజులు భారత్ ఆతిథ్యంలో జరిగే ఈ సమ్మిట్ను గౌరవిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ తీరు దేశ గౌరవానికి తీవ్ర దెబ్బ! రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవమానకర చర్యలు భారత్ను గ్లోబల్ స్టేజ్పై నవ్వు పాలు చేశాయి.
ఇది జాతీ ఆత్మగౌరవానికి, దేశ అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు జరిగిన బహిరంగ అవమానం! ఇది ప్రతి భారతీయుడు ఖండించాలి.
కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రయోజనాల కంటే స్వార్థ రాజకీయాలే ప్రాధాన్యం. భారత్ అభివృద్ధి చెందకూడదు, యువతకు ఉద్యోగాలు రాకూడదు, ప్రపంచంలో గౌరవం పెరగకూడదు అనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు ప్రతి అవకాశంలో అడ్డుపడుతున్నారు.
ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ ఘటనలను వైఎస్సార్సీపీ ఖండించకపోవడం. వైసీపీకి దేశ గౌరవం గురించి ఆలోచన లేదు. అందుకే తల్లి కాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్ అని అంటారు.
దేశ ప్రయోజనాల విషయంలో ఇద్దరి వైఖరి ఒకటే – పార్టీ ప్రయోజనం ముందు, దేశ ప్రయోజనం తర్వాత.
కాంగ్రెస్ పార్టీ తక్షణమే దేశ ప్రజలకు, ప్రపంచానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి! ఇలాంటి హీన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాజకీయాలు దేశ ప్రతిష్టకు అతీతంగా ఉండాలి
భారత్ ఎదుగుతోంది, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది ఇలాంటి అడ్డంకులు ఎదురైనా ఆగదు. దేశ గౌరవాన్ని అవమానించేవారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరు! అని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు

