బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత గురువారం విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు.
టూరిజం రిసార్ట్స్ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ రిషికొండను సందర్శించేందుకు చంద్రబాబు బృందం వెళ్తుంది. అనుమతి లేదంటూ చంద్రబాబు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎండాడ జంక్షన్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ను పోలీసులు నిలిపివేసారు.
ఈ క్రమంలో పోలీసులకు, చంద్రబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
మరోవైపు..చంద్రబాబు రుషికొండ పర్యటనకు బయలుదేరడంతో.. టీడీపీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో టీడీపీ శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సాక్షి పత్రికలో బడ్జెట్ పై భజన వార్తలు: నారా లోకేశ్