కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో మార్కెట్లు యథావిధిగా ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పనిచేస్తాయని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఒక సర్క్యులర్లో స్పష్టం చేసింది.
ప్రభుత్వ రుణ ప్రణాళిక, ద్రవ్య లోటు లక్ష్యాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 4.1శాతం నుంచి 4.2శాతం మధ్య ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆర్థిక సర్వే 2025-26ను ఇప్పటికే ఈ నెల 29న పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

