telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మోదీ సీఎం కాకముందే గుజరాత్‌ అభివృద్ధి: చంద్రబాబు

foundation stone to bhogapuram airport
మోదీ సీఎం కాకముందే గుజరాత్‌ అభివృద్ధి చెందిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో అభివృద్ధిని కేసీఆర్‌, మోదీ జీర్ణించుకోలేరని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోకాలడ్డు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేంద్రం వివక్షతకు విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ మరో రుజువన్నారు. 
సంక్షేమం, అభివృద్ధి, పాలనలో టీడీపీతో పోటీపడలేరని తెలిపారు. నిందలు వేయడంలో వైసీపీ, బీజేపీ ముందున్నాయని చంద్రబాబు దుయ్యబట్టారు.దేశ భద్రతలో టీడీపీ ఎప్పుడూ రాజీపడదని స్పష్టం చేశారు. రాష్ట్రాలలో అశాంతికి టీడీపీ వ్యతిరేకమన్నా ఆయన, రక్షణశాఖలో కుంభకోణాలను టీడీపీ ఖండిస్తుందన్నారు. అందుకే రాఫెల్‌పై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు.

Related posts