telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు

రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు.

క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్ తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృత మైందన్నారు.

ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేష్ ను ప్రశంసించారు.

ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదన్నారు.

యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా యువనేత లోకేష్ పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు

Related posts