సీఎం జగన్ పై మరోసారి టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “కూల్చివేతల YS Jagan Mohan Reddy రాక్షస ఆనందానికి అడ్డు అదుపు లేదు. సీఎం స్థానంలో ఉన్న వారికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కిక్ వస్తుంది. జగన్ రెడ్డి కి విధ్వంసం కిక్ ఇస్తుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ట. కరోనా కష్ట కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సేవలు అందించింది గీతం ఆసుపత్రి. ఎన్నో ఏళ్లుగా విద్యాబుద్ధులు నేర్పి ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చిన గీతం యూనివర్సిటీ పై విధ్వంసం జగన్ రెడ్డి నీచ స్థితికి అద్దం పడుతోంది. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా యుద్ధవాతావరణం సృష్టించారు. మొన్న సబ్బం హరి గారి ఇల్లు, నేడు గీతం యూనివర్సిటీ. పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్ రెడ్డి. విశాఖ లో విధ్వంసం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యడమే జగన్ రెడ్డి లక్ష్యం.” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసాడు. కాగా గత నెలలో సబ్బం హరి నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చిన విషయం తెలిసిందే.
previous post