నటిగా సాయిపల్లవి తోటి వారికంటే తాను డిఫరెంట్ అని మరోసారి నిరూపించుకుంది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సాయి పల్లవి… ఇప్పటి వరకు ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా కనిపించకపోవడం విశేషం. తాజాగా ఆమె ఒక భారీ డీల్ ను తిరస్కరించింది. తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా ఉండమని ఓ ప్రముఖ ఫేస్ క్రీమ్ సంస్థ సాయి పల్లవిని సంప్రదించింది.
ఆ యాడ్ కోసం సంస్థ వాళ్ళు రూ. 2 కోట్ల పారితోషికం ఇస్తామని ఆఫర్ చేశారు. అయినా, ఆ ఆఫర్ ను ఆమె సున్నితంగా తిరస్కరించింది. సినిమాల్లో కూడా తాను మేకప్ వేసుకోకుండా నటిస్తున్నానని… అలాంటిది ఫేస్ క్రీమ్ వాడమని జనాలను తాను ఎలా ప్రోత్సహిస్తానని ఆమె చెప్పింది. దీంతో, మేకప్ లేకుండానే తమ ప్రకటనలో నటించమని సదరు సంస్థ ఆమెను కోరినా… ఆఫర్ ను తిరస్కరించింది.
వీడియో బయటపెట్టేముందు కాస్త ఆలోచించి పెట్టండి..