సీఎం చంద్రబాబు గత కొన్నిరోజులుగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల అంశంపై తన పోరాటాన్ని తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. తొలి మూడు విడతల పోలింగ్ సమయంలో తనను దూషించడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత రూటు మార్చారని మోదీ అన్నారు.
ప్రస్తుతం దేశంలో ఎవరికి అనుకూల పవనాలు వీస్తున్నాయో తెలిసిన తర్వాత ఈవీఎంలపై పడ్డారని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే క్రికెట్ లో కొన్నిసార్లు అవుటైన బ్యాట్స్ మెన్ అంపైర్ ను తప్పుబట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తన పరిస్థితికి ఎన్నికల సంఘంపై నిందలు మోపుతున్నారంటూ చంద్రబాబుపై మోదీ విమర్శలు చేశారు.


“డబ్బిస్తే బిగ్ బాస్ హీరో… లేదంటే వెధవ” నాగార్జునపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు