telugu navyamedia
రాజకీయ

బీజేపీకి షాక్‌.. కాంగ్రెస్‌ గూటికి మాజీ క్రికెటర్‌

మాజీ క్రికెటర్‌, బిహార్‌ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కీర్తి ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికవుతూ వస్తున్న ఆజాద్‌ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుచుకున్నారు. కాగా బీజేపీ నాయకత్వంలో విభేదించి ఆయన ఇటీవల ఆపార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 
అయితే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ నుంచి వేటుకు గురైనా విషయం తెలిసిందే.అయితే ఆజాద్‌ను దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పోటీలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సామాజిక వర్గానికి చెందిన పూర్వాంచాలీస్‌ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆజాద్‌ను బరిలోకి దింపాలని వ్యూహత్మకంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

Related posts