తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలపడం ఘోర తప్పిదం, తప్పు చేసినవారు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు.
కల్తీ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యి లేదు హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఏమైనా చేస్తారు. కల్తీ నెయ్యి అంశాన్ని రాజకీయంగా చూడొద్దు.
టీటీడీ ఛైర్మన్ పదవీ అనేది సామాన్యమైనది కాదు, తితిదే ధర్మకర్తల మండలి భక్తి పూర్వకంగా వ్యవహరించాలి.
టీటీడీలో కొనుగోలు కమిటీ అనేది ఉంటుంది కొనుగోలు కమిటీ అవినీతికి పాల్పడితే మట్టికొట్టుకుపోతారు.
నాణ్యత లేదని తెలిసీ నెయ్యిని అనుమతించిన వారు శిక్ష అనుభవిస్తారు. ఉద్యోగులు ఈ ఘటనతోనైనా మేల్కొని ఒక చైతన్యంతో పనిచేయాలి.
ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా ఏం చేయాలో ఆలోచించాలి పీఠాధిపతుల సూచనలను టీటీడీ తీసుకోవాలి.
రాష్ట్రంలో ఆవు నెయ్యి లభ్యత పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అమూల్లాగ రాష్ట్రంలో కూడా సహకార డెయిరీ పెట్టాలి అని మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.


ఆదిలాబాద్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు…