ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశం పాల్గొన్న ఎంపి సోయం ఎమ్మెల్యే జోగు రామన్న, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి గెలిచిందన్నారు..జోగు రామన్నసోయం బాపురావు ను ఏం చేయలేడన్నారు. నేను ఒకప్పుడు అన్నలకు భయపడలేదు, కేసీఆర్ కే భయపడలేదు, రామన్నా నీకు భయపడనని అన్నారు. సోయం దండు కదిలింది అంటే చాలు.. నీ అడ్రస్ గల్లంతు అవుతుందని హెచ్చరించారు. టిఅర్ఎస్ నాయకులు ఎన్నికలలో అక్రమాలకు పాల్పపడితే తన్ని తరమండని బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ నాయకుల పై టిఅర్ ఎస్ నాయకులు దాడి చేస్తే ప్రతి దాడి చేయాలన్నారు. జోగు రామన్న చేసిన అవినీతి వల్లే మంత్రి పదవి రాలేదని అన్నారు ఆయన. అమిత్ షా తల్చుకుంటే కేసీఆర్ జైల్లో ఉంటారన్న ఆయన బిజెపి అధికారంలోకి రాగానే తిన్న డబ్బులు కక్కిస్తామని అన్నారు. అయితే చూడాలి మరి దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారు అనేది.
previous post
జగన్ కేబినెట్ లో రోజాకు స్థానం కలిపిస్తే బాగుండేది: విజయశాంతి