ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ… ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్పై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర చరిత్రలో నూతన ఆధ్యాయానికి సీఎం జగన్ నాంది పలికారని మంత్రి అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఇvvచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చారని పేర్కొన్నారు.
40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు చేయలేని పనిని కేవలం మూడేళ్ల పాలన అనుభవం ఉన్న జగన్ చేసి చూపించారని చెప్పారు
నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని కోతలు కూసే కింగ్ మేకర్ చంద్రబాబు అనుభవం ఏమైందని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. కనీసం కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారని ఎద్దేవా చేశారు.ఈ అంశాలు పవన్ కల్యాణ్కు ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నించారు
చంద్రబాబు దున్నపోతు ఈనింది అని చెబితే పవన్ కళ్యాణ్ కట్టెసే రకమని పేర్ని నాని ఎద్దేవా చేశారు. కొక్కునూరు ఏలూరు జిల్లాలో ఉంటే కనీస అవగాహన లేకుండా లేఖ రాశారు.
అప్పట్లో అమరావతి భూములను బలవంతంగా తీసుకుంటే నడిరోడ్డు పై ఆందోళన చేస్తానన్నారు. లుంగీ కట్టుకుని విమానంలో వచ్చి చంద్రబాబును కలిసి అంతా బాగుంది అని చెప్పి వెళ్ళిపోయారు.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. నోటిఫికేషన్ ఏమైనా అధ్యయనం చేశాడా?? ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేశాడా? చంద్రబాబు వాట్సప్, మెయిల్ పెట్టగానే ప్రింట్ అవుట్ తీసి మీడియాకు లేఖ విడుదల చేయటం తప్ప పవన్ కళ్యాణ్ కు ఏం తెలుసు? అని పేర్ని నాని ప్రశ్నించారు.

