విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య విద్యార్థిని దీపిక మృతిపై పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు.
తెల్లవారుజామున అనుమానస్పద రీతిలో పీజీ ఫైనలియర్ వైద్య విద్యార్థిని దీపిక మృతి. మృతికి కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యగా భావిస్తున్న సహచర వైద్యులు.
పోలీసులతో కలిసి సీసీ కెమెరాలు పరిశీలించిన ఆసుపత్రి సూపరింటెండెంట్, ఎలాంటి అనుమానాస్పద ఘటన నమోదు కాలేదంటున్న అధికారులు.
నిన్న సా. 4 నుంచి ఉ. 8 వరకు విధులు నిర్వహించాల్సి ఉన్న దీపిక ఆకలిగా ఉందంటూ తోటి విద్యార్థినితో ఆహారం తెప్పించుకున్నట్లు సమాచారం.
కాస్త ఇబ్బందిగా ఉందంటూ వైద్యులకు చెప్పడంతో ఇంజక్షన్ చేసిన మరో విద్యార్థిని నిన్న రాత్రి 11.30 సమయంలో ఆపరేషన్ గదిలో బల్లపై పడిపోయి ఉన్న డాక్టర్ దీపిక.
దీపిక ముఖం రంగు మారిందంటున్న తోటి విద్యార్థులు.
ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విచారం వ్యక్తం చేశారు. దీపిక మృతికి గల కారణాలు తెలుసుకోవాలని సీపీ రాజశేఖరబాబును మంత్రి ఆదేశించారు.

