ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. హైదరాబాద్ మధురానగర్లోని తన నివాసంలో మంగళవారం అర్థరాత్రి దాటాక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది శ్రావణి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి టిక్ టాక్ లో పరిచయమైన దేవరాజ్ అనే వ్యక్తే అని, దేవరాజ్ కు శ్రావణి సీరియల్ అవకాశాలు ఇప్పించిందని, అయినప్పటికీ శ్రావణిని అతడు వేధించేవాడని, వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక ఈ ఘటనపై స్పందించిన దేవరాజ్ శ్రావణి చావుకు సాయి అనే వ్యక్తి కారణమని పేర్కొన్నాడు. తాజాగా శ్రావణి స్నేహితుడు దేవరాజ్ రెడ్డి విడుదల చేసిన వీడియో అవాస్తవం అని సాయి అనే వ్యక్తి మరో వీడియో విడుదల చేశాడు. తాను శ్రావణి ఫ్యామిలీకి ఫ్రెండ్నని చెప్పాడు. ఆమె చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నానని.. తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేశాడు. అయితే తాజాగా శ్రావణి – దేవరాజ్ ఫోన్ సంభాషణలు బయటకు వచ్చాయి. ఆ ఫోన్ సంభాషణలో శ్రావణిని దేవరాజ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. “మర్యాదగా వచ్చి గంట టైం గడపాలని, రాకపోతే తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేవని దేవరాజ్ బెదిరించగా, ‘ఇంతటితో ఆపేయ్.. నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు.. నీతో మాట్లాడను సారీ దేవ” అంటూ శ్రావణి మాట్లాడింది. శ్రావణి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
previous post
next post

