దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో, ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఆలియా భట్, డైసీ ఎడ్గార్జోన్స్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్దేవగణ్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి కథానాయిక డైసీ ఎడ్గార్జోన్స్ తప్పుకున్నట్లు ఇటీవలే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆమె స్థానంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోనున్నారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హీరోయిన్ల విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి మాత్రం శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్ లపై దృష్టి పెట్టినట్టు సమాచారం. “సాహో”లో శ్రద్ధా కపూర్ షూటింగ్ దాదాపు పూర్తయిందట. అందువలన ఆమెను ఈ సినిమాలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ శ్రద్ధా కపూర్ నో చెబితే, జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే నిర్ణయంతో రాజమౌళి ఉన్నారని అంటున్నారు. ఇక ఈ సినిమా 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
previous post
next post
సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు ? : పరిణితి చోప్రా