కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ఓ బాణసంచా తయారీ కేంద్రంలో
మధ్యాహ్నం జరిగిన భారీ బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాద వివరాలు: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ‘సూర్య శ్రీ ఫైర్ వర్క్స్’ తయారీ కేంద్రంలో ఈ భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది మహిళా కార్మికులే ఉన్నట్లు తెలుస్తోంది.
విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు.
వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని హోంమంత్రి వంగలపూడి అనితకు ఆదేశాలు జారీ చేశారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను సీఎం ఆదేశించారు.
సహాయక చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మరియు స్థానిక అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

