ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 నిమిషాలకు వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఆయన రాణించారు. పలు కార్యక్రమాలకి ఆయన యాంకర్గా కూడా పని చేశారు. రాజకీయాలలోను చురుకుగా పని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాలలో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాలలో హీరోగా చేశారు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్య కారణాల వలన ఐదేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్నారు వేణు మాధవ్. చివరిగా రుద్రమదేవి చిత్రంలో కనిపించారు. నిన్న వేణుమాధవ్ అంత్యక్రియలు మౌలాలీలో ఆయన అభిమానుల మధ్య ముగిశాయి. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా వేణుమాధవ్ ను కడసారి చూసేందుకు వచ్చారు. వేణు మాధవ్తో తనకున్న అనుబంధం గురించి మీడియాతో పంచుకున్నాడు. తనకు వేణు అన్న ఎప్పట్నుంచో పరిచయమని.. మేమంతా జబర్దస్త్లో బాగా నవ్విస్తున్నామని ఫోన్ చేసి చెప్పేవాడని గుర్తు చేసుకున్నాడు. అందర్నీ ఆప్యాయంగా పలకరించేవాడని చెప్పాడు ఆది. తనతో పాటు అందర్నీ బాగా చేస్తున్నారంటూ ప్రోత్సహించేవాడని, జబర్దస్త్ జడ్జి నాగబాబుతో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన కోసం సెట్కు వచ్చిన ప్రతీసారి తమను కూడా కలిసి అందరితో మాట్లాడి వెళ్లేవాడని చెప్పాడు ఆది. నాలుగు రోజుల కింద కూడా తనకు వేణు అన్న ఫోన్ చేసి.. తమ చుట్టాలబ్బాయి ఒకర్ని జబర్దస్త్లో ఎలాగోలా ఇరికించాలంటూ కోరాడని చెప్పాడు ఆది. ఆయన తనను కోరిన ఆఖరి కోరికను తీరుస్తానని చెప్పుకొచ్చాడు ఆది. అలాంటి మంచి వ్యక్తి ఇంత చిన్న వయసులో పోవడం అనేది జీర్ణించుకోలేని విషయం అని చెప్పాడు జబర్దస్త్ కమెడియన్. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని చెప్పాడు ఆది.
next post