ప్రపంచ కప్ లో భాగంగా నేడు శ్రీలంకతో ఆతిధ్య జట్టు తలపడుతుంది. ముందు ఫీల్డింగ్ చేసిన ఇంగ్లాండ్ లంక ను బాగా నిలువరించింది.. అదే తరహాలో లంక బౌలర్లు చెలరేగిపోతున్నారు. దీనితో ఇంగ్లండ్ స్కోర్ పెరగడం లేదు. 32 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ స్కోర్ 140. మరోవైపు ఇంగ్లండ్కు ఆదిలోనే షాక్ తగిలింది. మలింగ బౌలింగ్లో తొలి ఓవర్ రెండో బాల్కే బెయిర్స్టో డక్ ఔట్ అయ్యాడు.
శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. 233 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్కు శ్రీలంక నిర్దేశించింది. అయితే.. అదేమీ అంత భారీ లక్ష్యం కాదు. ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ ఆడినా గెలవచ్చు. కానీ.. శ్రీలంక బౌలర్లు ఆటగాళ్లను తమ బౌలింగ్తో కట్టడి చేస్తుండటంలో ఒక ఓవరుకు సింగిల్ డిజిట్ పరుగులే వస్తున్నాయి.
ఇండస్ట్రీలో 50 శాతం పనికిరాని వాళ్లే… కరోనా వల్ల వాళ్ల శాతం తగ్గుతుంది… డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్