తెరాస ఎమ్మెల్యే పై బీజేపీ నాయకులు చేసిన దాడి పై మంత్రి హరీష్ రావు స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి , ఓర్వలేక బీజేపీ నాయకులు పని గట్టుకొని నియోజకవర్గం అవతల ప్రాంతంలో ఉన్న ఒక దళిత ఎమ్మెల్యే పై భౌతిక దాడులకు దిగడం చాలా శోచనీయం.. ఇది హేయమైన చర్య.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న అని హరీష్ రావు తెలిపారు. ఇది ఉద్దేశ పూర్వకంగా పథకం ప్రకారం కావాలని , వాళ్ళు ఉంటున్న హోటల్ కి వెళ్లి వారి పై భౌతిక దాడులకు పాల్పడటం వారి దిగా జారుడు తనానికి నిదర్శనం అని సూచించారు. నిన్న మొన్న కొన్ని యాక్షన్ ప్లాన్ చేశారు.. అందులో బాగమే ఈ కుట్ర.. బీజేపీ నాయకులు శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. దాడికి 15 నిమిషాల ముందే పోలీస్ వాళ్ళు వచ్చి తనిఖీ చేసుకొని వెళ్లారు.. వాళ్ళ తనిఖీ ల సందర్భంగా ఎలాంటి ప్రచార సామగ్రి లేదు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు , పార్టీ శ్రేణులు సమయమనం పాటించి ఎవరీ పనుల్లో వారు నిమగ్నం అయి ఉండాలి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని మంత్రి హరీష్ రావు తెలిపారు.
previous post
ఏపీ గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల ప్రస్తావన!