telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిలో ట్రాన్స్‌కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమరావతి సచివాలయంలో ట్రాన్స్‌కో అధికారులతో సమీక్ష సమావేశం  నిర్వహించిన గొట్టిపాటి రవి కుమార్.

సీఎస్ విజయానంద్ గారు, ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్‌ గారితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న రూ.6,000 కోట్ల ట్రాన్స్‌కో ప్రాజెక్టుల పురోగతిని గొట్టిపాటి రవి కుమార్ సమీక్షించారు.

ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా మా ప్రధాన లక్ష్యంగా అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా, నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే పలు జిల్లాల్లో కీలక పనులు పూర్తయ్యాయి, ఏప్రిల్‌లోపు మరో 6 ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లను పూర్తి చేసి రాష్ట్ర విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాం అని గొట్టిపాటి రవి తెలిపారు.

Related posts