పేద ప్రజల ఆరోగ్య పరి రక్షణ కోసం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా , అభినందనీయంగాను ఉందని నాగబాబు చెప్పారు . ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆదివారంనాడు పేదల కోసం ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించింది . అన్నిరకాల వైద్య సేవల ప్రత్యేక డాక్టర్ల బృదం పేద ప్రజలను పరీక్షించి మందులను ఇచ్చింది . అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేసింది .
ఈ సందర్భంగా ప్రత్యేక అతిధిగా వచ్చిన నాగ బాబు మాట్లాడుతూ .. వైద్యం చాలా ఖరీదు అయిపోయిందని , పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందటం లేదని , ఇలాంటి స్థితిలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ పేద ప్రజల కోసం ఇలాంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఎంతో బాగుందని అన్నారు . పేద ప్రజలు ఎంతో మంది ఈ శిబిరానికి వచ్చి తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు . ఈ సందర్భంగా అధ్యక్షుడు డాక్టర్ కెఎల్ . నారాయణ, డాక్టర్ కె. వెంకటేశ్వరరావులను అభినందిస్తున్నాని చెప్పారు .
నిర్మాత అల్లు అరవిందు మాట్లాడుతూ . ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం బాగుందని , మొదటి నుంచి అన్ని క్లబ్ ల్లా కాకుండా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ప్రతి సంవత్సరం ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుందని , ఈరోజు అన్ని రకాల సేవలను ఉచితంగా ఉపయోగించుకొనే అవకాశాన్ని పేద ప్రజలకు కల్పించడం ఎంతో తృప్తిని కలిగించిందని చెప్పారు .
డాక్టర్ కె .ఎల్ . నారాయణ మాట్లాడుతూ .. ఇలాంటి మెడికల్ క్యాంపులను నిర్వహించడంలో డాక్టర్ కె. వెంకటేశ్వరరావు గారు అందిస్తున్న సహకారం మరువలేమని అన్నారు. ఈరోజు నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి అనేక మంది డాక్టర్లు వచ్చారని చెప్పారు . వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు .
డాక్టర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ , ఈరోజు ఆరోగ్య శిబిరాన్ని ఇప్పటికే 400 వందల మంది పేదలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని , వైద్యాన్ని ఉచితంగా పేదలకు అందించడంలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు .
మా అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ , పేద ప్రజలకోసం ఇలాంటి శిబిరాన్ని నిర్వహించిన కల్చరల్ సెంటర్ కార్య వర్గ సభ్యులను అభినందించారు
ఈ కార్యక్రంలో కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి , ఉపాధ్యక్షులు ముళ్ళపూడి మోహన్ , కోశాధికారి తుమ్మల రంగారావు, హరి ప్రసాద్ , శైలజ , కిషోర్ , భగీరథ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు