telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కస్టడీలోకి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి: సిట్ విచారణ ప్రారంభం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని  సిట్ అధికారులు  కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు (బుధవారం) నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకాణిని కస్టడీలోకి తీసుకుని కృష్ణపట్నం పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్ అక్రమ రవాణా, ఎంపీ మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో మాజీ మంత్రి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులోనే కాకాణిని సిట్ కస్టడీలోకి తీసుకుంది.

సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో న్యాయవాది సమక్షంలో విచారణ జరుగనుంది.

గతంలో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్ధాల వినియోగం, అట్రాసిటీ కేసులో మూడు రోజులు పాటు కాకాణిని పోలీసులు విచారించగా.. మాజీ మంత్రి ఏ మాత్రం సహకరించని విషయం తెలిసిందే.

మరి ఈరోజు కస్టడీలో సిట్ అధికారుల ప్రశ్నలకు కాకాణి ఏ మేరకు సమాధానాలు చెబుతారో చూడాలి.

Related posts