telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్ర సీఎంలు మోడీ కనుసన్నల్లో బతుకుతున్నారు…

CPI Narayana

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై ఇవాళ సీపీఐ నేత నారాయణ స్పందించారు. రైతులు అందరూ పార్టీలతో సంబంధం లేకుండా కలిసి కట్టుగా.. ఉద్యమం చేస్తున్నారని తెలిపారు. కేంద్రం మాత్రం రైతులను అవమానపరిచేలా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రైతులకు తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీలు నడుస్తున్నాయని సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధాని మోడీ కనుసన్నల్లో బతుకుతున్నారని నారాయణ పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ, వైసీపీ మరియు తెలుగు దేశం పార్టీల మధ్య ప్రేమాయణం నడుస్తుందని చురకలు అంటించారు. అటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మరియు ఎంఐఎం పార్టీల మధ్య ప్రేమాయణం నడుస్తుందని నారాయణ అన్నారు. కాగా.. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఇవాళ్టితో ముగిసింది. ఈ సందర్భంగా నారాయణ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

Related posts