దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు పోరాటం చేస్తున్నారు.. దీంతో, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బీజేపీ అగ్రనేతలు నిన్న రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన.. రైతుల ఆందోళనపై చర్చించారు అంటే.. పోరాటం ఎంత సీరియస్గా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. అయితే, ఢిల్లీ కేంద్రంగా .. వ్యవసాయ వ్యతిరేక బిల్లులపై రైతులు పోరాటం చేస్తున్నారు.. వారి పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. రైతులపై చేసిన లాఠీచార్జిను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించిన ఆయన.. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు.. మరోవైపు.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెప్పారని రైతులు సన్నాలు వేశారు.. కానీ, ఈ రోజు కొనే పరిస్థితి లేదని మండిపడ్డారు. ప్రతీ గింజను కొనే వరకు ప్రభుత్వంపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తుందని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.
previous post
next post

