త్వరలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు కన్నేశాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సయ్య మరణం తరువాత ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటె, ఈ స్థానంపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉన్నది. ఈసారి తిరిగి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. ఇప్పుడు పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తే దానిప్రభావం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పడుతుందని, ఉప ఎన్నిక ముగిసే వరకు పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించవద్దని పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలిపారు. తెలంగాణ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని తెలియజేయడంతో, పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలిక వాయిదా పడింది. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయబోతుండటంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచించడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సాగర్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. చూడాలి మరి ఈ ఉపఎన్నికలో ఏం జరుగుతుంది అనేది.
previous post

