గత కొంత కాలంగా తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెట్టి తిడుతున్న కొన్ని X హ్యాండిల్ ప్రొఫైల్స్పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇటీవల సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినా తనపై ఇంకా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు ఫిర్యాదులో దయా చౌదరి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై కూడా తగు చర్యలని తీసుకోవాలని అన్నారు.
చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

