ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్న నేప్థ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో స్కూళ్లు తెరిచి పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దని హితవు పలికారు.
రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 70 శాతం కేసులు నమోదవడం కరోనా తీవ్రతకు నిదర్శనమని అన్నారు. నిత్యం 10 వేల కొత్త కేసులు, 100 మంది చనిపోతున్నా జగన్ లో చలనంలేదని దుయ్యబట్టారు. జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంక్షోభం వచ్చినప్పుడే పాలకుల సమర్థత బయటపడుతుందని తెలిపారు.


జనసేన కార్యకర్తపై దాడి.. వైసీపీపై పవన్ ఫైర్