డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం “స్వయం” అనే పేరును గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.
డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై సచివాలయంలో నేడు సమీక్షించారు.
బ్రాండింగ్ కల్పించే ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు, లోగోలను పరిశీలించి, ప్రజాభిప్రాయం మేరకు “స్వయం” పేరు ఖరారు చేశారు.
డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారని, వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
స్థానిక మార్కెట్లే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలా బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలని అన్నారు. ఈ సమీక్షలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

