telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు.

బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి, బ్రిటిష్ వారిని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ అంటూ కొనియాడారు.

నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పంథాలో పోరాడిన దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చంద్రబాబు అన్నారు.

స్వతంత్ర భారతావని కోసం ఆయన చేసిన పోరాటం అనన్య సామాన్యమని కీర్తించారు. దేశం కన్నా ఏదీ మిన్న కాదు అని చెప్పిన ఆ యోధుని స్ఫూర్తి ఎప్పటికీ అనుసరణీయమేనని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు  అని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

విప్లవ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నా హృదయపూర్వక నివాళి, పరాక్రమ్ దివస్ నాడు, ఆయన అచంచలమైన స్ఫూర్తిని మరియు భారత స్వాతంత్ర్య పోరాటానికి విశేషమైన కృషిని గౌరవించటానికి అంకితమైన రోజు.

ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) స్థాపకుడిగా, సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన అవిశ్రాంత పోరాటం లక్షలాది మంది హృదయాలను మండించింది, వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా వారిని ప్రేరేపించింది.

“నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను” అని దేశానికి ఆయన చేసిన శక్తివంతమైన పిలుపు దేశభక్తి మరియు ధైర్యానికి దీటుగా నిలుస్తూనే ఉంది”  అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Related posts