telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

WHO ఈవెంట్‌లో భాగస్వామ్యం కానున్న షారుఖ్ …

Sharukh

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రభుత్వాలకు అండగా నిలుస్తూ పలువురు సెలబ్రిటీలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ కొందరు సాంగ్స్ విడుదల చేస్తుండగా, మరికొందరు కరోనాపై పోరాటానికి విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ సంస్థ ‘డబ్ల్యూ హెచ్ ఓ’ నిర్వహిస్తున్న కచేరీలో భాగం కాబోతున్నట్లు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ప్రకటించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా బాధితులకు ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్లు, నర్సులకు, హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్ సభ్యులకు మద్దతు తెలుపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇంటర్నేషనల్‌ అడోకసి ఆర్గనైజేషన్‌ గ్లోబల్‌ సిటిజన్‌ సంస్థలు కలిసి ఓ వర్చువల్ కచేరీని నిర్వహిస్తున్నాయి. ‘వన్‌ వరల్డ్‌ టుగెదర్‌ ఎట్‌ హోమ్‌’ పేరిట జరగనున్న ఈ కచేరీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీనటులను భాగం చేయనున్నారు. అయితే ఈ కచేరీలో తానూ భాగమవుతున్నట్లు షారుఖ్ వెల్లడించారు. ఏప్రిల్ 18వ తేదీ రాత్రి ఈ వర్చువల్ ఈవెంట్ జరగనుందని తెలిపారు.

Related posts